జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. "పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు, కడప నుండి గూండాలు, రౌడీలను పిఠాపురానికి తీసుకువస్తున్నారు. ఈ కుట్ర వెనక మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులను పిఠాపురం తరలిస్తున్నారు. ఎంతమంది వచ్చినా మేం బెదిరేది లేదు.. చూసుకుందాం." అని నాగబాబు హెచ్చరించారు.