సాయంకాలం దిన పత్రిక నూతన క్యాలెండర్ ను స్థానిక జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా సుధీర్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. గత రెండు దశాబ్దాలకు పైగా సాయంకాలం దిన పత్రికను నిరాటంకంగా ప్రచురిస్తూ పాఠకుల హృదయాలను చురగొనడం ఎంతో అభినందనీయమన్నారు. కొత్త ఏడాదిలో నూతన ఒరవడితో సాయంకాలం దిన పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.