పుష్పగిరి కొండపై వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి ఆలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం గోదాదేవి చెన్నకేశవస్వాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలోని కల్యాణ వేదికపై పట్టుపీతాంబరాలతో పుష్పమాలికలతో అలంకరించిన గోదాదేవి చెన్నకేశవస్వాముల ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు.