కాజీపేట మండలంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు

10891చూసినవారు
ఖాజీపేట మండలంలో కడప జిల్లా ఎస్పీ, మైదుకూరు డివిజన్ డిఎస్పి ఆదేశాల మేరకు కాజీపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన దుంపలగట్టు, కాజీపేట, పుల్లూరు, పత్తూరు గ్రామాలలో కేంద్రక సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును ఎటువంటి భయం లేకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపేట పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్