మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో అతి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులలో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరని వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తానని తెలియజేస్తూ మరొకమారు డిఎల్ రవీంద్ర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.