ప్రొద్దుటూరు ఆర్టిపిపి రోడ్డు పై వరద నీరు

67చూసినవారు
ప్రొద్దుటూరులోని రామేశ్వరం వద్ద ఆర్టీపీపీకి వెళ్లేందుకు పెన్నా నదిపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మైలవరం జలాశయం నుంచి 12000 క్యూసెక్కుల నీటిని అదికారులు విడుదల చేయడంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు
నిలిచిపోయాయి. అటువైపు ఎవరూ వెళ్లకుండా గురువారం పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్