
వేంపల్లె ఐఈఆర్టీ యశోదకు ఘన సత్కారం
ప్రొద్దుటూరుకు చెందిన కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అధినేత కామిశెట్టి పుల్లయ్య త్రయోదశ వర్ధంతి సంస్మరణ సభను ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేంపల్లి మండల భవితా కేంద్రంలోని ఐఈఆర్టీ యశోదకు అవార్డు అందజేసి సత్కరించారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా యశోదతో పాటు పలువురికి సత్కారం చేశారు. ఈ సందర్భంగా తమ సేవలు గుర్తించి అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.