ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు స్థానిక తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ఈ ప్రాంత శాసనసభ ప్రతినిధికి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, వెంకటకృష్ణ, రవి, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.