గండి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి విరాళం

83చూసినవారు
గండి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి విరాళం
గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం సింహాద్రిపురం మండలంలోని కంబల్లి గ్రామ వాసి ముల్లుకుంట్ల వెంకటనాగిరెడ్డి, చిన్నపుల్లారెడ్డిలు రూ. 50, 116/- విరాళాన్ని సమర్పించారని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.

సంబంధిత పోస్ట్