రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: తులసిరెడ్డి

57చూసినవారు
బాపట్ల మండలం ఈపురుపాలెం పంచాయతీసీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన అత్యాచారం దుర్ఘటన అమానుషమని ఏపీ సిసి మీడియా చైర్ మెన్ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ. యువతిని కర్రలతో కొట్టి, అత్యాచారం చేసి చంపి రైల్వే ట్రాక్ వద్ద పడేయడం బాధాకరమని ఆవేదన చెందారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు.

సంబంధిత పోస్ట్