వేంపల్లిలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

61చూసినవారు
భారత మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప దార్శనికుడు, మార్గ దర్శి అని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి అన్నారు. కలాం 93 వ జయంతిని కాంగ్రెస్ నాయకులు మంగళవారం వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వయం కృషితో ఒక సామాన్యుడు, అసామాన్యుడు కాగలడని, రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని, ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడని కలాం నిరూపించారన్నారు.

సంబంధిత పోస్ట్