ఉమ్మడి కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం దక్షిణ ద్వారం రహదారి లో వర్షం పడితే నీరు నిల్వ ఉంటుంది. దింతో రాకపోకలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల వసతి గృహం కూడా దక్షిణ ద్వారం వైపు ఉండడంతో భక్తులు అధికంగా వస్తూ పోతుంటారు. అధికారులు స్పందించి నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.