దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణ ఆధారిత టోకు (హోల్సేల్) ధరల సూచీ జూన్లో 16 నెలల గరిష్ట స్థాయి 3.36 శాతానికి చేరింది. మేలో హోల్సేల్ ద్రవ్యోల్బణ సూచీ 2.61 శాతం, ఏప్రిల్లో 1.26 శాతంగా మాత్రమే నమోదైంది. ఆహార వస్తువులు, ఆహార పదార్థాల తయారీ, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ చమురులు, ఇతర ఉత్పత్తి వస్తువుల ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల కన్పించింది.