రాష్ట్ర రవాణ, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం తమ క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఫోన్ చేసి తెలియజేశారు. ప్రజల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అన్నారు.