రాయచోటి: ఈ నెల 15న లక్ష్మీ వృద్దాశ్రమం ప్రారంభం

70చూసినవారు
రాయచోటి: ఈ నెల 15న లక్ష్మీ వృద్దాశ్రమం ప్రారంభం
అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణ పరిధిలో గల తిరుపతి నాయుడు కాలనీలో చిత్తూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా అర్చన విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న లక్ష్మీ వృద్దాశ్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అర్చన విద్యాసంస్థల అధినేత మదన మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అధికారులు హాజరవుతున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్