రాయచోటి: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

67చూసినవారు
రాయచోటి: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు ఎప్పటిలాగే సోమవారం ఉంటుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని అక్కడ పరిష్కారం కానీ వారు జిల్లా కేంద్రానికి రావాలన్నారు.

సంబంధిత పోస్ట్