సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల పంట పొలాల మధ్య వెలసిన శ్రీ బొబ్బిలి దేవమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద మహాన్నదానం నిర్వహించినట్లు కమిటీ నిర్వాహకులు గ్రామ రైతు సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ లక్ష్మీ కళ్యాణి ఎంటర్ ప్రైజస్ ప్రైవేట్. లి. ప్రొప్రయిటర్ చందవోలు వీరవెంకట సత్యనారాయణ మూర్తి (సత్తిపండు గారు)తెలియజేశారు. పెదబ్రహ్మదేవం చిన్న రేవు పంటపొలాల మధ్య రైతు సోదరులు అందరూ ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు.