కాకినాడ జిల్లాలోని పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. కాకినాడలో శనివారం సాయంత్రం
జేఎన్టియూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, వాహనాల పార్కింగ్ వంటివి జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు.