ప్రజలకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన నీటిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 10 నీటి నమూనాలను పరీక్షించాలని, కనీసం 25 మంది గృహ యజమానులను కలిసి మంచినీటి నాణ్యత ను అడిగి తెలుసుకోవాలని ఆయా సచివాలయ ఎమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఆయన ఆనంద్ థియేటర్ సమీపంలోని ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని పరిశీలించారు.