రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిన రాజప్ప

72చూసినవారు
కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని పెద్దాపురం ఎమ్మెల్యే చిన రాజప్ప తెలిపారు. సామర్లకోట మండలంలోని హుస్సేన్ పురంలో 20 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. 1 కోటి నిధులతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్