పెద్దాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు కట్

62చూసినవారు
ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలు కిందికి విడుదల చేస్తుండడంతో దిగువన ఉన్న పెద్దాపురం మండలానికి ముంపు బెడద ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దాపురం మండలం కాండ్రకోట దాబ్బ కాలువ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ మీదకు నీరు చేరింది. దీంతో సోమవారం కాండ్రకోట నుంచి కట్టమూరు, తిమ్మాపురం, కాట్రావులపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్