పంటలు సాగుచేస్తున్న వారంతా తప్పనిసరిగా ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ కోరారు. ఆదివారం గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో పొలాలను పరిశీలించి, ఈక్రాప్ నమోదు చేశారు. గడువు సమీపిస్తున్నందున రైతులు ఆర్బీకేల వద్ద ఈక్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే వ్యవసాయ సిబ్బంది ఆయా గ్రామాల్లో రైతులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. సెప్టెంబర్ 15తో పంటల నమోదు ముగుస్తుంది.