టీడీపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్

564చూసినవారు
తుని పురపాలక మాజీ ఛైర్ పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు వైసీపీ నుంచి టీడీపి తీర్థం పుచ్చుకున్నారు. తుని మండలం తేటగుంట పార్టీ కార్యాలయంలో వీరికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ అభ్యర్థి యనమల దివ్య కండువా కప్పి వారిని పార్టీలోకి బుధవారం ఆహ్వానించారు. టీడీపీ విజయానికి తామంతా కృషి చేస్తామని శోభారాణి దంపతులు తెలిపారు. వీరితో పాటు, హాస్పటల్ మెంబర్ , మాజీ కౌన్సిలర్ పలువురు ప్రముఖులు టీడీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్