డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏనుగుల దాడులను అరికట్టడానికి కుంకి ఏనుగులు, వాటికి శిక్షణ అందించే మావటీలను అందించడంతో పాటు ఏనుగు శిబిరం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కర్ణాటక అటవీశాఖకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి అటవీ శాఖ సంబంధిత అంశాల్లో ఎంతో అనుభవం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్