ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులను మార్చి 31 ఆదివారం కూడా విధులు నిర్వహించాలని ఆర్బిఐ ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఏజెన్సీ బ్యాంకులకు చెందిన బ్యాంకులకు ఈ ఆదేశం వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారం చివరి రోజు అయిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సూచన వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన నగదు లావాదేవీలను పూర్తి చేయడానికి మార్చి 31ని వర్కింగ్ డేగా మార్చారు.