వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీను) "జై భీమ్ భారత్ పార్టీ"లో చేరారు. సోమవారం విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు జై భీమ్ పార్టీ వర్గాలు తెలిపాయి.