పొత్తు ధర్మానికి తాము వ్యతిరేకం కాదని జనసేన నాయకుడు లీలాకృష్ణ అన్నారు. సోమవారం మండపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తమకు అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసకెళతానన్నారు. తనకు సరైన ప్రాతినిద్యం ఇస్తేనే పార్టీ బరువు బాధ్యతలను మోయగలనన్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ కావాలన్నారు.