కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

65చూసినవారు
ప్రజలకు ఇష్టమైతేనే వారి ఇంటిపై కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లను అంటించాలని అధికారులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన రాజమండ్రి మున్సిపల్ కాలనీ వద్ద నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమన్నారు.

సంబంధిత పోస్ట్