కడియం: ట్రాక్టర్లు యజమానులు, డ్రైవర్లు ఆవేదన

82చూసినవారు
కడియం మండలం బుర్రిలంక ఇసుక ర్యాంపు నందు తమకి తీవ్ర అన్యాయం జరుగుతుందని మండలంలోని ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్లు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. బుర్రిలంక ఇసుక ర్యాంపు నందు కోనసీమ జిల్లా నుండి అనేక ట్రాక్టర్లు రావడంతో తమకి ప్రాధాన్యత లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న, ట్రాక్టర్ల యజమానులకు డ్రైవర్లకు కూలీలకు అవకాశం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్