వరద బాధితులకు టీడీపీ శ్రేణులు భారీ విరాళం

51చూసినవారు
వరద బాధితులకు టీడీపీ శ్రేణులు భారీ విరాళం
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరద బాధితులకు అండగా నిలవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రూ. 1,00,500 విరాళం సేకరించారు. ఈ మొత్తానికి గురువారం ఎమ్మెల్యే గోరంట్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, వట్టికూటి జానకి రామయ్య చౌదరి, దేవళ్ళ రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్