కోరుకొండ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోరుకొండ, గాడాల, నిడిగట్ల, మధురపూడి, పాలచర్ల తదితర గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.