సాధ్యం కానీ హామీలతో మోసం చేస్తున్నారు: శ్రీనివాసరావు

65చూసినవారు
రాజకీయ పార్టీలు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని మానవ హక్కుల వేదిక అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలు మండలం తాటిపాకలో ఆదివారం మానవ హక్కుల వేదిక కరపత్రాల ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రజలను మోసం చేసే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగ్దానాలను అమలు చేయలేని పార్టీలకు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు.

సంబంధిత పోస్ట్