సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ తెలిపారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణం సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. వాటిని పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని వరప్రసాద్ హామీ ఇచ్చారు. పార్టీ నేతలు పాల్గొన్నారు.