మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన సుబ్బారాయుడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 2009లో PRPలో చేరిన ఆయన 2014లో తిరిగి టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరి, స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీని వీడారు.