చల్లపల్లి: ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించుకోవాలి

69చూసినవారు
చల్లపల్లి: ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ కోరారు. మంగళవారం సాయంత్రం చల్లపల్లి ఏటీఎం సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రత్యేక శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించారు. ఎమ్మెల్సీ ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని ఓట్ల నమోదుపై విస్తృత ప్రచారం చేసి పట్టభద్రులు ఓట్లు నమోదు చేయించుకునేలా వారికి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్