పర్నసా లో ఓ కుటుంబం పై దాడి

76చూసినవారు
పర్నసా లో ఓ కుటుంబం పై దాడి
గుడివాడ రూరల్ మండలం పర్నసా గ్రామంలో ఎస్సీ మాలలపై యాదవులు సామాజిక వర్గం దాడి చేసింది. పర్నాస గ్రామంలో గంటా తంబీ చికెన్ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అప్పులు గురించి కొలుసు నాగభూషణం, తంబీ ఇరువురుకి వారం క్రితం ఘర్షణ చోటు చేసుకుంది. నాగభూషణం కుమారులు ఆదివారం కిరాయి మనుషులను రెండు కార్లలో తీసుకొచ్చి గంటా తంబీ కుటుంబం చిన్నా పెద్దా తేడా లేకుండా మొత్తాన్ని చితకబాదించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్