May 19, 2024, 12:05 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
కూతురిని హతమార్చిన తల్లిదండ్రుల అరెస్టు.. రిమాండ్ కు తరలింపు
May 19, 2024, 12:05 IST
కన్నకూతురిని హత్య చేసిన తల్లిదండ్రుల్ని రిమాండు తరలించామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్య చేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.