ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

1074చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రారంభమైనవి. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరీక్షా సెంటర్లలో అధికారులు ఏర్పాటు చేశారు. సమయానికి ముందుగానే విద్యార్థులు పరీక్ష సెంటర్లకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్