జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే బుడమేరు ముంపుకు ప్రధాన కారణం

68చూసినవారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాగుకు, నదికి తేడా తెలియదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు విమర్శించారు. మిడి మిడి ఙ్ఞానంతో అవగాహన రాహిత్య విమర్శలు చేస్తున్నాడని అన్నారు. బుడమేరు గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్