సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం

76చూసినవారు
సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిసెంబర్ నెల 2023వ సంవత్సరంలో నిత్య అన్నదాన మండపానికి సీలింగ్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సీలింగ్ మొత్తం ఒక్కసారిగా కుప్ప కూలి కిందకు పడిపోయింది. నాణ్యత లోపంతో సీలింగ్ పనులు నిర్వహించడమే దీనికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. ఉదయం పూట కావడంతో ఎవరూ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్