మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్యే

51చూసినవారు
కోడూరు మండలం హంసలదీవి బీచ్ ఘటన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో హంసలదీవి బీచ్ ఘటన బాధితులను ఆదివారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ పరామర్శించారు. గుడివాడ నుంచి వచ్చిన ముస్లిం పర్యాటకులు తీరంలో ఉన్న సమయంలో రెండు పెద్ద అలలు రావటంతో ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. ఓ మహిళ మృతి, ఒకరు గల్లంతు కావటం బాధాకరం అన్నారు.

సంబంధిత పోస్ట్