కృష్ణా జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే. రామారావు తెలిపారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు జడ్పీ హైస్కూల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు.