అధికార యంత్రాంగం అప్రమత్తమైంది

69చూసినవారు
కృష్ణానది తాజా వరదలకు ఎడ్లంక బాట కొట్టుకుపోయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డ మండలం ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహ పరిస్థితిని వెంకట్రామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్లంక ప్రజల కోసం పడవ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్