అభివృద్ధి చేసే నాయకుడికే పట్టం కట్టండి: వెనిగండ్ల రాము

17819చూసినవారు
అభివృద్ధి చేసే నాయకుడికే పట్టం కట్టండి: వెనిగండ్ల రాము
నందివాడ మండలం టెలిఫోన్ నగర్, నూతలపాడు, జొన్నపాడు గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మచిలీపట్నం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి మోసం చేసిన జగన్ కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్