గన్నవరం మండలం మెట్ల పల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీ ఒక మామిడి తోటలో అక్రమంగా నిల్వచేసిన గోవాకు చెందిన అక్రమమధ్యని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1210 కేసుల మధ్యన్నీ గుర్తించి ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం అధికారుల ఆదేశాలతో బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఆర్వో గీతాంజలి శర్మ, ఎస్పీ అద్నాల్ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.