గన్నవరం: అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యం

559చూసినవారు
గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామంలో రూ. 76 లక్షల మేర నిధులతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి మహర్దశ వచ్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్