పలువురు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

19492చూసినవారు
పలువురు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు
ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయతీ కొత్తగూడెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు శనివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని ఉంగుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు పాతూరి విజయ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్