సేవాశ్రమంలోని కామాంధుడి పై చర్యలు తీసుకోవాలి

69చూసినవారు
ఏలూరులోని బాలికల హాస్టల్లో కీచకపర్వం నిర్వహించిన కామాంధుడి పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజి ఎమ్మెల్యే డిఎన్నార్ అన్నారు. బుధవారం కైకలూరులో అయన మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి చేయడం, ఫొటోషూట్లంటూ బాలికలను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేయడం అమానుషం అన్నారు. అటువంటి నిందితుని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్