ఆసుపత్రికి వచ్చే సిబ్బందితో మర్యాదగా మెలగాలి

70చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే సిబ్బంది తో మర్యాదగా నడుచుకోవాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రమైన మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సెలవుపై వెళ్లిన వైద్యాధికారి స్థానంలో రెగ్యులర్ వైద్యాధికారిణిని నియమిస్తామన్నారు. రెగ్యులర్ గా వచ్చే రోగుల వివరాలు, నెలలో జరిగే కాన్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్