మొగులూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
కంచికచర్ల మండలంలోని మొగులూరు గ్రామంలో బుధవారం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాలకు జగనన్న సంక్షేమ పథకాలు మేలు పర్వతంలా వరాలు ప్రసాదిస్తున్నాయన్నారు.